22 మరియు 70 లేదా
20 మరియు 22 లేదా
13 మరియు 84 లేదా
14 మరియు 78.
21 February 2013 రోజు సాయంత్రం
వరకు ఇవి వట్టి అంకెలు మాత్రమే. ఏడు గంటల సమయంలో హైదరాబాద్ దిల్ షుఖ్ నగర్ లో జరిగిన జంట బాంబుల పేలుళ్ళ తరువాత ఆ అంకెలు వ్యక్తులు,
జీవితాలు మరియు కుటుంబాలు అయ్యాయి. అవును ఈ అంకెలు వివిధ మీడియా ల లో రిపోర్ట్ చేసిన,
ఆ
విషాద సంఘటన లో మరణించిన మరియు గాయపడిన వారి సంఖ్య.
ఎవరు చేసారు? ఎందుకు చేసారు?
ఇంటలిజెన్స్ వైఫల్యమా? పోలీసుల అలసత్వమా? నాయకుల అసమర్థతా?
ఇంక భవిష్యత్తు లో ఇలాంటివి జరగకుండా ఏమి
చెయ్యాలి?
దానికి ఎవరెవరు ఏమి చెయ్యాలి?
ఇది ప్రశ్నలు వేసుకోవడానికి గాని, విశ్లేషణ లు చెయ్యడానికి గాని సమయం కాదు.
ఇది బాధితులను గురించి ఆలోచించే సమయం. వారి
కుటుంబాల గురించి ఆలోచించే సమయం.
అక్కడ బాధితులు కేవలం వ్యక్తులు కాదు. వాళ్ళు
కూతుర్లు , కొడుకులు.
భార్యలు, భర్తలు.
తల్లులు, తండ్రులు.
స్నేహితులు.
ఇలాంటి ఇంకెన్నో, బంధాలు, అనుబంధాలు వాళ్ళు . వాటి చుట్టూ అల్లుకున్న కుటుంబాలు.
ఆ బంధాలు తెగిపోయాయి.
వాళ్ళు చెరిగి పోయిన కలలు. ఆశలు, భవిష్యత్తులు.
ఇది, చనిపోయిన కుటుంబాల వాళ్ళు , గాయపడిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాల వాళ్ళు-
వాళ్ళు కొలిచే దేవుడి మీద నమ్మకం ద్వారా గాని,
మానవత్వం మీద నమ్మకం ద్వారా గాని,
బతకాలనే
తీవ్రమైన ఆకాంక్ష ద్వారా గాని -
ఈ విషాదాన్ని భరించగలిగే శక్తి ని పొందాలి అని కోరుకుంటూ, ఆశిస్తూ మనం వారి కోసం
ప్రార్థన చేసే సమయం.
Cant agree more!!
ReplyDelete